
జయ్ న్యూస్, నిజామాబాద్: బి.శ్రీనివాసు,హోంగార్డ్ : 211, పోలీస్ శాఖలో హోమ్ గార్డ్ గా (32) సం॥ ల సర్వీసు పూర్తి చేసి ” పదవి విరమణ” పొందారు. శుక్రవారం వీరి పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శాలువాలతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేట్ (జ్ఞాపికలతో) ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని అన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంట్ కు చేసిన సేవలు ఎంతో ఘణనీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (సి.ఎ.ఆర్) కె.రామచంద్ర రావు, సతీష్ (హోంగార్డ్స్), శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్ఫేర్) మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.