
జయ్ న్యూస్, మాక్లూర్: మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని వంజరి సంఘం కమ్యూనిటీ హాల్ లో బిజెపి మండల అధ్యక్షురాలు మమత రాజేశ్వర్ అధ్యక్షతన “11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం -సంకల్పంతో సాకారం” బిజెపి కార్యక్రమాల మాక్లూర్ మండల శాఖ కార్యశాలను ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై ప్రారంభించారు. బూత్ అధ్యక్షులకు పార్టీ కార్యక్రమాల గురించి, ప్రధాని మోడీ అభివృద్ధి సంక్షేమం గురించి వివరించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సూచించారు. బిజెపి పార్టీ ఓటు కోసం కాకుండా దేశం కోసం ఆలోచన చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా యోగ దినోత్సవం ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో జరిగే విధంగా చూడాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మోడీ పిలుపుమేరకు “మాకే నాంపే ఏక్ పెడ్” కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరచి ప్రజలను మోసం చేస్తున్న విధానాలను ఎండగడుతూ రాబోయే 25 రోజులు పార్టీ ప్రణాళిక రూపొందించి నాయకులు, కార్యకర్తలకు సమాయత్తం చేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మొక్కను నాటి ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మండలంలోని సంస్థ గత ఎన్నికల్లో భాగంగా మండల కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నేడు నియమించి నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడంలో మోడీ అకుంఠిత దీక్ష దేశం ఎంతటి సాంకేతిక నైపుణ్యంతో శత్రుదేశాలను మట్టి కల్పించగలమని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహాత్ములు ప్రధాని మోడీకి భారతదేశం హర్షిస్తూ మాక్లూర్ మండల సమావేశంలో ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రబారి కలిగోట్ గంగాధర్, జిల్లా కార్యదర్శి సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొత్తూరు గంగాధర్, సీనియర్ నాయకులు, బూత్ నాయకులు పాల్గొన్నారు.