
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మండలం మెండోరా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న ఇద్దరు లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పదం ఆధ్వర్యంలో స్త్రీ నిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి రూపాయలు 40 వేల చొప్పున ఇద్దరు లబ్ధిదారులకు 80 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదార్లు ఇళ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం కొరకు మీ గ్రామ సీసీలను గాని లేదా వివో గాని సంప్రదించి స్త్రీ నిధి కింద లోన్ తీసుకొని నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించడానికి కృషి చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్ సీసీలు శ్రీనివాస్, నరేష్, PS ప్రశాంత్ వివో అధ్యక్షురాలు హర్షిని గ్రామ నాయకులు రమేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.