
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్ గల్ మండలం బెజ్జోర గ్రామంలోని, ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న, మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడిన ఏకరూప దుస్తులు, స్కూల్ యూనిఫామ్ లు, మరియు పాఠ్యపుస్తకాలను గ్రామ శాఖ అధ్యక్షులు మద్దూరి భాస్కర్, మూడేళ్ల అశోక్ లు కలిసి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఐదు మంది లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయాలని ఉద్దేశంతో పాఠశాల పిల్లల ఏకరూప దుస్తులను కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పజెప్పడం జరిగిందని, దీని ద్వారా ఈ సంవత్సరం మండలంలోని మహిళలు నాలుగు లక్షల 25 వేల రూపాయలను సంపాదించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామల, ఉపాధ్యాయులు వరలక్ష్మి, శ్రీనివాస్, అధ్యక్షురాలు జంగిటి లక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు రవి, రాకేష్, శ్రీను, మహిళా సమాఖ్య సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులున్నారు