
జయ్ న్యూస్, భీమ్ గల్: భీంగల్ మండలం మెండోర గ్రామంలోని, ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న, మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడిన ఏకరూప దుస్తులు, స్కూల్ యూనిఫామ్ లు, మరియు పాఠ్యపుస్తకాలను మండల విద్యాశాఖ అధికారి స్వామి, ఎంపీడీఓ సంతోష్, ఐకెపి ఎపిఎం రవీందర్, సీసీలు కుంట శ్రీనివాస్, నరేష్, డిసిసి కార్యదర్శి కుంట రమేష్ లు, కలిసి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా 50వేల రూపాయల రుణానికి సంబంధించిన చెక్కును కూడా ఎంపీడీవో చేతుల మీదుగా లబ్ధిదారుకు అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలను బలోపేతం చేయాలని ఉద్దేశంతో పాఠశాల పిల్లల ఏకరూప దుస్తులను కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పజెప్పడం జరిగిందని, దీని ద్వారా ఈ సంవత్సరం మండలంలోని మహిళలు నాలుగు లక్షల 25 వేల రూపాయలను సంపాదించడం జరిగిందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముత్తేన్న, ఇతర ఉపాధ్యాయుల బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మానస, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్, ముచ్కూర్ రాజు, ఎర్రన్న,మహిళా సమాఖ్య సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.