
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శిగా గిరిజన నాయకుడు గూగులోత్ తిరుపతి నాయక్ ఎన్నిక కావడంతో శనివారం ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి లు నియామాక పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పట్టణంలో మొట్టమొదటి గిరిజన నాయకుడికి ఉన్నత స్థాయి పదవి దక్కడం గొప్ప విషయమని, బిజెపి పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్ కు వారు సూచించారు. బిజెపి పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని తిరుపతి నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.