
జయ్ న్యూస్, ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలో ER ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ ను సమత సైనిక్ దళ్ రాష్ట్ర కోఆర్డినేటర్, అంబేద్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డిఎల్ మాల మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ కు కార్యకర్తలను, నాయకులను ఎలా తయారు చేసుకోవాలి… సిద్ధాంత పుస్తకాన్ని డిఎల్ మాల బహుకరించారు. వారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం అత్యవసరం, అనివార్యం అని బీసీలు ఎమ్మెల్యేలు కావాలి అనే నినాదం ప్రజల్లో మారుమోగుతుందని, మన వాట దిశగా మనం అడుగులు వేయాలని డి ఎల్ మాల అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ముహూర్తం మండల అధ్యక్షులు అంగుళీమాల, చిత్తాపూర్ రాజు, రాంప్రసాద్, ఇస్తాకొద్దిన్ తదితరులు ఉన్నారు.