
జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లు గత సంవత్సరం బోనస్ క్వింటాల్ కు 500 చొప్పున చెల్లించింది… యాసంగి పంటకు కూడా సన్నాలు వేస్తే క్వింటాల్ కు బోనస్ 500 రూపాయలు…ఇస్తామని చెప్పడంతో అంతా కూడా యాసంగి పంటలో సన్నాలు ఎక్కువగా వేయడం జరిగింది… యాసంగి పంట 8.30 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది… ఇందులో కొనుగోలు చేసిన దాదాపుగా 7.33 మెట్రిక్ టన్నుల సన్నావి వారి ధాన్యం కొనుగోలు చేసి నెల రోజులు గడుస్తున్నప్పటికీ బోనస్ డబ్బులు క్వింటాల్ కు 500 రూపాయలు చొప్పున ఇప్పటివరకు ఇవ్వలేదు… ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వానకాల పంట దుక్కులు ప్రారంభమవుతున్న సందర్భంగా రైతుకు పెట్టుబడికి ఆసరాగా బోనస్ డబ్బులు ఉపయోగపడతాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని అన్నారు.