
జయ్ న్యూస్, ఆర్మూర్: వర్షాకాలం ప్రారంభంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అవగాహన కల్పించాలని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ అయేషా, హెల్త్ ఆఫీసర్ హకీల్, ఎంపీడీఓ గంగాధర్ అన్నారు. బుధవారం ఆలూర్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిలకు, ఆరోగ్య సిబ్బందికి సీజనల్ వ్యాధుల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధులపై ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రజలకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. మలేరియా, ఫైలేరియా, డెంగి, చికెన్ గున్యా,టైఫాయిడ్, ఫీవర్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలలో ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల రాకుండా ఉండటానికి ఇంటి ఇంటికి ఆశ కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆరోగ్య సిబ్బంది వ్యాధుల పట్ల నీరు నిల్వ ఉండకుండా కుండీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి దోమలను నియంత్రించేందుకు విధిగా ఫాగింగ్ చేయించి గ్రామాల్లోని ప్రతి వాడలో మురికి కాలువల వద్ద బ్లీచింగ్ చల్లడం నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమలు వ్యాప్తి చెందకుండా మురికి కాలువ యందు స్ప్రే చేయించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వ్యాధులను అరికట్టొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది సంతోష్, పంచాయతీ కార్యదర్శి లు రాజలింగం, నసీర్, శ్రీనివాస్, షేకర్, దినేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు