
జయ్ న్యూస్, జక్రాన్ పల్లి: జక్రాన్ పల్లి గ్రామంలో కట్కం సంతోష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మొట్ట మొదటి సారి సీటి గ్లోబల్ మార్కెట్ వారి సహకారంతో డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వారు నూతన వరి సాగు విధానాన్ని వేయించడం జరిగింది. ఈ పద్ధతిని అనుసరించి వరి సాగు చేయడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, వాతావరణ కాలుష్యనికి కారణమైన మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్ వాయువులు విడుదలమైన శాతాన్ని తగ్గించవచ్చు. తద్వారా వాతావరణ కాలుష్యం కొంత వరకు తగ్గించవచ్చు…. సాంప్రదాయ పద్ధతితో వరిని సాగు చేయాలంటే బురద నీటిలో నాట్లు వేయాలి. ఇందుకు నీటి వినియోగం పెరగడంతో పాటు పెట్టుబడి కూడా ఎక్కువగానే అవుతుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా, నీటి వినియోగాన్ని తగ్గిస్తూ పెట్టుబడి ఖర్చులను తగ్గించి పర్యావరణహితుగా మెట్ట వరిని సాగు చేసుకోవచ్చు. ఈ మెట్ట వరి సాగుకై భూమిని 2సార్లు దున్ని గుళ్ళగా మార్చి చదును చేసుకొని ట్రాక్టర్ వెనకాల మళ్లీ క్రాఫ్ ప్లాంటర్ పరికరాన్ని బిగించి విత్తనం మరియు ఎరువుని ఒకసారి వేసుకోవచ్చు. దీని వలన మనకి ఎకరానికి (నాటు, దమ్ము ఖర్చులు) 10,000 వరకు ఆదా అవుతుంది. రైతులు సుతోష్ రెడ్డి, ప్రతినిధులు సినియర్ ఎగ్జిక్యూటివ్ సనూత్న, సుష్మిత, ఫీల్డ్ ఆఫీసర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.