
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ లో గల కాంతి హై స్కూల్ లో బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు మరియు కొందరు విద్యార్థులు పోతరాజు వేషధారణ ధరించి బోనాల సంబరాల్లో పాల్గొన్నారు. చక్కగా బోనాలను అలంకరించుకొని అమ్మవారికి బోనాలను మరియు నైవేద్యాలను సమర్పించడం జరిగింది. తర్వాత విద్యార్థిని విద్యార్థులు వివిధ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంతి హై స్కూల్ వ్యవస్థాపకులు మరియు ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ “మా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు తమ సాంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ వాటి విలువలను తెలుసుకుంటూ వచ్చే తరాలకు కూడా మార్గనిర్దేశం చేస్తూ ఆదర్శవంతంగా ఉండాలని, ప్రతి సంవత్సరం మా పాఠశాలలో సంస్కృతి సాంప్రదాయాలకు ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని” తెలపడం జరిగింది. కాంతి హై స్కూల్ డైరెక్టర్ శశాంక్ రెడ్డి మాట్లాడుతూ చదువులు, ఆటలు, పాటలతో పాటు సంస్కృతి సాంప్రదాయాల విలువలను విద్యార్థి దశ నుండే నేర్చుకోవడం మరియు తెలుసుకోవడం ద్వారా పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి చేకూరుతుందని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొని సంబరాలను విజయవంతం చేశారు.