
జయ్ న్యూస్, భీమ్ గల్: భీమ్గల్ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పరిశుభ్రతను పెంపొందించాలని కోరుతూ NSUI జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ మున్సిపల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రెహమాన్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నాచు పేరుకుపోయి విద్యార్థులకు ఇబ్బందిగా మారుతోందని విద్యార్థులు రాకపోకలు సాగించే క్రమంలో జారి పడిపోయి గాయాల పాలవుతున్నారని మున్సిపల్ సిబ్బందితో తక్షణమే నాచును తొలగించాలని కోరారు. అలాగే వర్షాకాలం కావడంతో కళాశాల ఆవరణలు పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలు విపరీతంగా పెరిగి పాములు తేళ్లు వంటి విష ప్రాణులకు ఆవాసంగా మారాయి. వాటి వల్ల విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్నందున పాఠశాల ఆవరణలో గల పిచ్చి మొక్కలను ముళ్లపదలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ ను కళాశాల ఆవరణలో చల్లించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు ప్రభాస్, కైఫ్ ,రంజిత్, హర్షిత్ ,రెహాన్ ,సుఫేన్, ఫర్హాన్ తదితరులు పాల్గొన్నారు.