జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లి లో గల నలంద హైస్కూల్లో 4వ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు మంగళవారం నాడు E-ABYAS హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఐఐటి & ఒలంపియాడ్ కు సంబంధించిన ఆర్యబట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహించారు. దాదాపు తరగతికి ఐదుగురు విద్యార్థుల చొప్పున దగ్గర, దగ్గరగా 60 విద్యార్థులు ఈ పరీక్ష రాయడం జరిగింది. నలంద మేనేజ్మెంట్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా E-ABYAS హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఐఐటి & ఒలంపియాడ్ సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని మరియు ఈ పరీక్షల వలన విద్యార్థులకు సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ మరియు మెంటల్ ఎబిలిటీలో విద్యార్థులకు భవిష్యత్తులో జేఈఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్ మరియు ఎంసెట్ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇట్టి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఐఐటి & ఒలంపియాడ్ ఇంచార్జ్ ఉపాధ్యాయులైన రాజశ్రీ, శ్వేతా, శివ మరియు షాకీర్ ఆధ్వర్యంలో ఆర్యబట్ట మెంటల్ ఎబిలిటీ పరీక్షలు నిర్వహించారు.
