జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పొగాకుతో తయారైన మత్తు పదార్థాలు సిగరెట్టు, గుట్కా, తంబాకు మరియు జరద వంటి పదార్థాలను తినకూడదని, మత్తు పానీయాలను త్రాగకూడదని, వాటి ద్వారా వచ్చే అల్సర్, పక్షవాతము, రక్తం గడ్డ కట్టడం మరియు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలని డాక్టర్ మానస విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ చెడు వ్యసనాలు చెడు స్నేహం చేయకూడదని మంచి అలవాట్లను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
