జయ్ న్యూస్, ఆర్మూర్: మండలంలోని చేపూర్ గ్రామంలో ఆదివాసీ నాయక పోడ్ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 3 నుండి 5వ తేదీ వరకు భీమన్న దేవుని ఉత్సవాల కరపత్రాలను గురువారం ఆర్మూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి, ఎస్ టి సెల్ మండల అధ్యక్షుడు నాగరాజులు మాట్లాడుతూ నవంబర్ 3 నుంచి 5 వరకు జరగబోయే బీమన్న ఉత్సవాలతోపాటు మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ క్రీస్తు శేషులు మీనుగు పెద్ద రాజన్న జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు వారి కుమారుడు ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ఆదివాసి సంఘం సభ్యులు వినియోగించుకొని కబడ్డీ పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
