జయ్ న్యూస్, ఆర్మూర్: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియాంబర్స్ లను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరాలుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు, విద్యాసంస్థల వారు ఆందోళనలు చేస్తున్నారు అయిన ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నవి, పేద మధ్య తరగతి విద్యార్థుల పైన ఆర్థిక భారం పడి విద్యను అభ్యసించడం కష్టతరం అవుతుంది. ఒకవైపు కాలేజీలను నిర్వహించడం ఇబ్బంది అవుతుందని సాధ్యమవడం లేదని ప్రవేట్ యజమాన్యాలు చెప్పడం ప్రభుత్వం చర్చలు జరపకపోవడం వారికి నిధులు కేటాయించకపోవడం వల్ల వారు కూడా కళాశాలలో బంద్ చేశారు. ఎప్పుడు విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల సమయంలో ఈ నిర్ణయం ద్వారా అనేకమైన విద్యార్థులు నష్టపోతారు పరీక్షలు ఇబ్బందిగా మారుతూ ఇవన్నీ ఇబ్బందులను ప్రభుత్వం స్పందించాలి సమస్యను పరిష్కరించాలి అందుకే వారి బందుకు మద్దతుగా తదితర డిమాండ్లతోటి ఈనెల 28వ తేదీన ఆర్మూర్ సబ్ కలెక్టర్ ముట్టడి నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు తరలిరావాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఏరియా అధ్యక్షులు నిఖిల్, నాయకులు వివేక్, ఖుషి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
